బెంగుళూర్లో బీజేపీ మంత్రి నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ప్రమాదవశాత్తు కార్యకర్త చనిపోయాడు. సోమవారం (ఏప్రిల్ 8)న బెంగళూరు నార్త్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తు్న్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కేఆర్ పురం ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మంత్రి శోభా కారు రోడ్డు పక్కగా నిలిచి ఉండగా డ్రైవర్ చూసుకోకుండా డోర్ తెరిచాడు.
అటుగా స్కూటర్పై కారు పక్క నుంచి వెళ్తున్న బీజేపీ కార్యకర్త ప్రకాష్(63) ఆ కారు డోర్ను ఢీకొట్టి రోడ్డుపై పడ్డాడు. ప్రకాష్ బస్సు కిందపడి అక్కడిక్కడే మరణించాడు. దీంతో కేంద్ర మంత్రి కారు డ్రైవర్, బస్సు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో కేంద్ర మంత్రి లేరని పోలీసులు తెలిపారు. ఆమె అక్కడ ప్రచారం కోసం కారు దిగి ర్యాలీగా వెళ్లారని చెప్పారు.